పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని వీరిశెట్టిగూడెంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగరాజు(38) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించేందుకు దుండగులు ప్రయత్నించారు. ద్విచక్రవాహనం, మృతదేహన్ని రోడ్డు పక్కన పడేశారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగిందని మృతుడి బంధువులు చెబుతున్నారు. నాగరాజు మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.