ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bus Accident: బాదంపూడి వై-జంక్షన్‌ వద్ద బస్సు బోల్తా.. బస్సులో 40 మంది ప్రయాణికులు

By

Published : Sep 27, 2021, 8:13 AM IST

Updated : Sep 27, 2021, 8:23 AM IST

bus accident
bus accident

బాదంపూడి వై-జంక్షన్‌ వద్ద బస్సు బోల్తా పడింది. మలుపు తిరిగే క్రమంలో బస్సు బోల్తా పడి 20 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బాదంపూడి వై-జంక్షన్ వద్ద మలుపు తిరిగే క్రమంలో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణకులు ఉన్నారు. 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడేనికి చెందిన అంబులెన్సు వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అదే సమయంలో వర్షం కురవడంతో ప్రమాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి: GULAB EFFECT: తీరం దాటిన గులాబ్‌ తుపాను..గాలుల బీభత్సం

Last Updated :Sep 27, 2021, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details