కృష్ణాజిల్లా తిరువూరులో గర్భిణికి నొప్పులు రావటంతో సకాలంలో అంబులెన్స్ రాక రోడ్డుపై ప్రసవించింది. తుమ్మల దుర్గ పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండగా కుటుంబీకులు అంబులెన్స్కు ఫోన్ చేశారు. 108 వాహనం ఎంత సేపటికి రాకపోవటంతో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. చివరికి మార్గమధ్యలో షాదీఖానా వద్ద రోడ్డుపైనే కూలబడిపోయింది. స్దానికుల సమాచారం మేరకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించడం సాధ్యం కాక అక్కడే కాన్పు చేశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
108 రాక ఆలస్యం... రోడ్డుపైనే ప్రసవం...
కృష్ణా జిల్లా తిరువూరులో అవమానీయ ఘటన జరిగింది. 108 అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆరోగ్యసిబ్బంది తెలిపారు.
అంబులెన్స్ ఆలస్యంతో మార్గమధ్యలోనే ప్రసవించిన మహిళ