ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాటుసారా పట్టివేత... ఏడుగురి అరెస్ట్

By

Published : Apr 16, 2020, 8:41 PM IST

నాటుసారా అక్రమ రవాణా చేస్తున్న పలువురిని అబ్కారీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

natusara-pattivetha-seven-members-arrest
నాటు సారా పట్టివేత...ఏడుగురి అరెస్ట్

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సహాయ అబ్కారీ పర్యవేక్షణాధికారి శ్రీనాథుడు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఒడిశా నుంచి పార్వతీపురానికి నాటుసారా తీసుకువస్తున్న వ్యక్తిని ఆర్కే బట్టివలస వద్ద అరెస్ట్ చేసినట్లు టాస్క్​ఫోర్స్ సీఐ జైభీమ్ తెలిపారు. అతని నుంచి 450 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మండలం తాళ్ల బురిడి వద్ద 1150 సారా ప్యాకెట్లను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:బయటకి వచ్చారో ఆ రాక్షసుడి చేతిలో చచ్చారే!

ABOUT THE AUTHOR

...view details