విజయనగరం జిల్లా పార్వతీపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా రైతులు నష్టపోకూడదనే ఆలోచనతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. మొక్కజొన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
సచివాలయాల ద్వారా పంటల కొనుగోళ్లు : పుష్పశ్రీవాణి
వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. లాక్డౌన్ ప్రభావం రైతులపై పడకుండా మద్దతు ధర అందించేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె తెలిపారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర అందేలా అన్ని చర్యలు చేపడతామన్నారు.
ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి