ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయనగరంలో జోరు వాన.. పిడుగుపడి వ్యక్తి మృతి

By

Published : Apr 18, 2021, 7:45 PM IST

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో జరిగింది. పొలంలో పనులు చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది.

man dead by thunder lightning
పిడుగుపడి వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగళ్ళు గ్రామానికి చెందిన బీ.దాలినాయుడు(46) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభం కాగా.. ఆ ప్రాంతంలో ఉన్న రైతులంతా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంతలో పిడుగు పడటంతో దాలినాయుడు అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ABOUT THE AUTHOR

...view details