ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు

By

Published : May 26, 2021, 4:38 PM IST

కొవిడ్ బారిన పడి హోంఐసోలేషన్​లో ఉండేందుకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల కోసం విజయనగరంలో ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉచితంగా వసతి, మందులు, పౌష్టికాహారం వైద్య సదుపాయాలు అందిస్తామని నిర్వహకులు తెలిపారు.

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు

విజయనగరంలో కరోనా బారిన పడి...హోంఐసోలేషన్ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరవకవలసలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తిరుమల ఆస్పత్రి యాజమాని తిరుమల ప్రసాద్ ప్రారంభించారు. 20 పడకలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఉచితంగా వసతి, మందులు, పౌష్టికహారం, వైద్య సదుపాయాలు అందిస్తామని నిర్వహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details