ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసు కుటుంబాల కోసం.. కల్యాణ మండపం ప్రారంభం

By

Published : Nov 5, 2020, 5:52 PM IST

విజయనగరంలో శ్రీ శ్రీ శ్రీ దేవీ దండుమారమ్మ కల్యాణ మండపాన్నిజిల్లా ఎస్పీ ప్రారంభించారు. పోలీసుల కుటుంబాల సౌకర్యార్థం ఉపయోగించాలని సూచించారు.

building opened for police welfare
కల్యాణ మండపం ప్రారంభం

పోలీసు కుటుంబాలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు దేవీ దండుమారమ్మ కల్యాణ మండపాన్ని ఉపయోగించాలని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ఆధునీకరించిన మండపాన్ని ఆమె ప్రారంభించారు.

పోలీసుల సమావేశాలకు కూడా మండపాన్ని వినియోగిస్తామన్నారు. శుభ్రతను పాటించాలని అధికారులకు సూచించారు. మండపం అభివృద్ధి కోసం శ్రమించిన పోలీసులను, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రిని జిల్లా ఆమె అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details