ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rally: నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి వైకాపా యత్నం

By

Published : Sep 18, 2021, 1:13 PM IST

Updated : Sep 18, 2021, 2:08 PM IST

ycp cadre helds rally at narsipatnam
నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి వైకాపా యత్నం

13:09 September 18

ఎమ్మెల్యే గణేశ్ ఆధ్వర్యంలో వైకాపా ర్యాలీ

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి వైకాపా యత్నం

ముఖ్యమంత్రి జగన్​పై(cm jagan) తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్(mla umashankar ganesh) డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టేందుకు యత్నించారు. చివరకు నర్సీపట్నం పోలీస్ స్టేషన్​లో.. ఎమ్మెల్యే గణేష్​ సహా పలువురు కార్యకర్తలు అయ్యన్నపాత్రుడుపై ఫిర్యాదు చేశారు.  

ఇదీ చదవండి: 

CHANDRABABU: చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలపై కేసులు నమోదు

Last Updated :Sep 18, 2021, 2:08 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details