ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amarnath Comments on Pawan Kalyan: "చిత్తుగా ఓడిపోతారనే.. పవన్ సాకును వెతుక్కున్నారు"

By

Published : May 13, 2023, 1:32 PM IST

Gudivada Amarnath Comments on Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓటమి తప్పదనే టీడీపీతో పవన్‌కల్యాణ్‌ పొత్తుకు సిద్ధమయ్యారని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. 2024లో రెండు పార్టీలు కలిసి వచ్చినా వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

Gudivada Amarnath
గుడివాడ అమర్నాథ్

Amarnath Comments on Pawan Kalyan:

Gudivada Amarnath Comments on Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​పై మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. రంగులేసుకుని సినిమా తీసే పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం దారుణమన్నారు. విశాఖ సర్క్యూట్ హౌస్​లో మీడియాతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. పవన్ కల్యాణ్ సిగ్గు వదిలేసి చంద్రబాబు కోసం పని చేస్తాను అని చెప్పేశారని అన్నారు.

గత ఎన్నికల్లో కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయి. మళ్లీ పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిపోతామని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని అవుతున్నారని అన్నారు. మార్చి ఆవిర్భావ సభలో తనకు తాను దేవుడిగా చెప్పుకున్న పవన్ కల్యాణ్, జనసేన కాదు జెండా సేనగా మార్చారని అన్నారు. పవన్ కల్యాణ్ జనసేనలో నాయకులను జెండా మోసే కూలీలుగా మార్చారన్నారు.

జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వైసీపీని గద్దె దించడానికే పార్టీ పెట్టాను అని పవన్ చెప్పుకుంటున్నారని.. జనసేన 175 కి 175 సీట్లలో పోటీ చేయాలని అన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లిన తరవాత ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ పవన్ కల్యాణ్ ఇప్పటికి బయట పెట్టాడని.. పవన్ కల్యాణ్​కి ఎజెండా లేదు, సిద్ధాంతం లేదని విమర్శించారు. వారాహి వాహనం ఎక్కడికి పోయింది.

లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టారు.. వారాహి షెడ్​కి వెళ్లిపోయిందని.. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలో పోటీ చేసి ఓడిపోవడం కంటే మాట్లాడకుండా ఊరుకొని ఉండటం మంచిదన్నారు. స్టార్ డం వచ్చింది అంటే ప్రజలు వల్ల అని.. ఆ ప్రజలను కూడా పవన్ మోసం చేశారని మంత్రి అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు జనసేన అసలు స్వరూపం గుర్తించాలని సూచించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండు పార్టీలు ఓడిపోతాయని జోస్యం చెప్పారు.

"జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పుడు ఏ రోజు అయినా కాంగ్రెస్ ఓడిపోవాలని లేదంటే చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని చెప్పలేదే.. రాజశేఖర్ రెడ్డి పరిపాలన మళ్లీ రాష్ట్రానికి తీసుకొనివస్తాం అన్నారు. ఓట్లు వేయండి.. అధికారం ఇవ్వండి అని మాత్రమే చెప్పారు. కానీ ఈయన వచ్చి ఏమి అంటే.. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అని అంటున్నాడు. ఆయన ఓటింగ్ శాతం ఏమో 6.8 ఉంది. మళ్లీ ఇప్పుడు పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోతే.. ఇప్పుడు వచ్చే జనం కూడా రావడం మానేస్తారు. దానికి బదులు చంద్రబాబు నాయుడు ఓటమితో.. మన ఓటమి కూడా కలిపేస్తే.. చంద్రబాబు వలన ఓడిపోయాం అని చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు. అందుకే ఓ పక్క రాజకీయంగా సాకును వెతుక్కున్నాడు.. మరో వైపు సంచి సర్దేశాడు".- గుడివాడ అమర్నాథ్, మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details