SUPERSTAR RAJINIKANTH AT TIRUMALA : తిరుమల శ్రీవారిని సూపర్స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. సూపర్స్టార్కి.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. మూలమూర్తిని దర్శించుకున్న సూపర్ స్టార్.. స్వామివారికి కానుకలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శనానంతరం ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.
తిరుమల శ్రీవారిని, కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్న సూపర్స్టార్ రజనీకాంత్..
HERO RAJINI AT TIRUMALA : తిరుమల శ్రీవారిని సినీ నటుడు రజనీకాంత్ దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. తిరుమల నుంచి ఆయన కడప దర్గకు వెళ్లారు.
SUPERSTAR RAJINIKANTH AT TIRUMALA
కడప పెద్ద దర్గాను దర్శించుకున్న రజనీ: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్లు కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. సూపర్స్టార్ కుమార్తె ఐశ్వర్యతో పాటు, రెహమాన్ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. దర్గా ప్రతినిధులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో పెద్ద దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 15, 2022, 2:11 PM IST