ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High Court Hearing on TTD Board Members Appointment: 'వారి నియామకం భక్తుల మనోభావాలకు విరుద్ధం'.. తితిదే సభ్యుల నేరచరిత్రపై హైకోర్టులో విచారణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 3:55 PM IST

High Court Hearing on TTD Board Members Appointment: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నేరచరిత్ర ఉన్న వ్యక్తుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. శరత్‌ చంద్రారెడ్డి, కేతన్‌, సామినేని ఉదయభాను వంటి వ్యక్తుల నియామకం చెల్లదంటూ చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. హైకోర్టు స్పందిస్తూ.. సభ్యుల నియామకంపై పూర్తి వివరాలు దాఖలు చేయాలని దేవాదాయ కమిషనర్‌, తితిదే ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

High Court Hearing on TTD Board Members Appointment
High Court Hearing on TTD Board Members Appointment

High Court Hearing on TTD Board Members Appointment:తితిదే బోర్డు సభ్యులుగా ఉంటూ.. దేవ దేవుడికి సేవ చేయాలని వేల మంది ఆశ పడుతూ ఉంటారు. అలాంటి వారు కేవలం భక్తి భావనతో మాత్రమే దేవుడి సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఉంటారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యులుగా కొనసాగేందుకు దేశవ్యాప్తంగా ఉండే శ్రీనివాసుని భక్తులు పోటీ పడుతుంటారు. అందు కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. అలా వారికి తోచిన పైరవీలు చేసుకుంటారు. ఇదంతా గత కొంతకాలంగా కొనసాగుతున్నా.. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్నవారినో.. తమ పార్టీకి చెందిన వారికో.. ఆ బాధ్యతలు అప్పగించడం పరిపాటిగా మారింది. కానీ ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం.. ఛైర్మన్​, ధర్మకర్తల మండలి ( Board of Trustees ) ని నియమించిన అంశంపై వివాదం చెలరేగిందనే చెప్పుకోవాలి. మొదట తిరుమల తిరుపతి దేవస్థానంఛెర్మన్​గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంతో మెుదలైన రాజకీయ రచ్చ.. తితిదే బోర్డు (TTD Board) సభ్యుల నియామకంలో సైతం కొనసాగుతోంది. తాజాగా తితిదే బోర్డు సభ్యుల నియామకంపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బోర్డు మెంబర్లుగా నియమించడం విమర్శలకు తావిస్తోంది.

BJP Leaders Dharna Against TTD Decision: టీటీడీ స్థలం కుల సంఘానికి కేటాయించడంపై బీజేపీ ఆగ్రహం.. ధర్నా

నేరచరిత్ర వున్నవాళ్లు: వైసీపీ ప్రభుత్వం హిందూ మతాన్ని కించపరిచే చర్యలు చేపడుతోందని ఇప్పటికే భక్తులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా తితిదే ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు మహామహులు పోటీ పడుతుంటే.. క్రైస్తవ మతాన్ని పాటించే వ్యక్తికి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తితిదే ఛైర్మన్ (TTD Chairman) పదవిని కట్టబెట్టారని ఆరోపించాయి. ఆ గొడవలు సద్దుమణుగుతున్నాయనుకునే లోపే మళ్లీ ధర్మకర్తల మండలి నియామకంపై విమర్శలు మెుదలయ్యాయి. తితిదే బోర్డు మెంబర్లలో నేరచరిత్ర వున్నవాళ్లు ఉండటంతో హిందూ సంఘాలు, వేంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.

Actor Shahrukh Khan Visited Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్..

తితిదే బోర్డు సభ్యులుగా నేర చరిత్ర ఉన్న వ్యక్తులు :నేర చరిత్ర ఉన్న వ్యక్తులను తితిదే బోర్డు సభ్యులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎండోమెంట్ చట్టాలకు వ్యతిరేకంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తులు శరత్ చంద్రారెడ్డిడాక్టర్ కేతన్, సామినేని ఉదయభాను నియామకం చెల్లదంటూ చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. నేరచరిత్ర వున్నవాళ్లు బోర్డు సభ్యులుగా ఉండటం భక్తుల మనోభావాలకు తీవ్ర విఘాతం కలిగించే అంశమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. తాత్కాలిక బెయిల్ (Temporary bail) పై కొనసాగుతున్న నిందితుడిని తిరుమల తిరుపతి (Tirumala tirupati) దేవస్థానంలో రాజకీయ ప్రయోజనాలతో ఎన్నిక చేయటం చట్ట విరుద్ధమని న్యాయవాది తెలిపారు. సభ్యుల నియామకంపై పూర్తి వివరాలు దాఖలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

VIP Darshan in Tirumala for those who Wrote Govinda Koti: యువతలో భక్తిభావం పెంచేలా 'గోవింద కోటి'.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details