ఆంధ్రప్రదేశ్

andhra pradesh

GUN FIRE: మద్యం మత్తులో భార్యను కాల్చి చంపిన భర్త

By

Published : Oct 17, 2021, 2:45 PM IST

GUN FIRE

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తే తన భార్యను నాటు తుపాకీతో కాల్చిచంపాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో భార్యను.. భర్తే నాటు తుపాకితో కాల్చి చంపిన ఘటన శనివారం జరిగింది. భరణి కోట కాలనీకి చెందిన పద్మ, జోగ్గారావు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం అలవాటు ఉన్న జగ్గారావు.. ఆ మత్తులో తరచూ భార్య పద్మ(33)తో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గారావు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో భార్యను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details