ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cpi narayana: అడవిబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు: సీపీఐ నారాయణ

By

Published : Sep 17, 2021, 3:14 AM IST

Cpi Narayana Tour Over at Srikakulam

అడవిబిడ్డల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జన ఆందోళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

గిరిజనుల వల్లే ఇప్పటికీ అడవులు ఉన్నాయనీ.. వారే లేకుంటే భూస్వాములు ఎప్పుడో ఆక్రమించుకునేవారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారయణ అన్నారు. గిరిజనుల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదనిహెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం పాలవలసలో నిర్వహించిన జన ఆందోళన్​ ఆయన పాల్గొన్నారు. పాలకొండలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. నారాయణగూడ గిరిజన గ్రామాన్ని సందర్శించిన నారాయణ.. ఆదీవాసుల ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. ప్రజల ఆస్తుల్ని ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని.. అందుకే ఆయన పాలనకు వ్యతిరేకంగా ఈనెల 27న నిర్వహిస్తున్న భారత్ బంద్​లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details