ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అచ్చెన్నాయుడుపై మానవతా దృక్పథంలో వ్యవహరించకుండా.. అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యతో ప్రభుత్వం కక్షపూరితమైన, దుర్మార్గమైన పాలనకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.... జాగ్రత్తలు పాటిద్దాం- మనల్ని మనం రక్షించుకుందాం అనే గోడ పత్రికలను విడుదల చేశారు.
'అచ్చెన్నాయుడు వ్యవహారంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది'
అచ్చెన్నాయుడు వ్యవహారంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలందరూ కనీస జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు.
కనిగిరిలో తెదేపా నేతల సమావేశం