ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT: రోడ్డుపై బోల్తా పడి..రెండు ముక్కలై..

By

Published : Sep 13, 2021, 4:36 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్​ను తప్పించబోయి సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్ రెండు భాగాలుగా విడిపోయింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

accident
accident

నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని స్థానిక చెక్ పోస్ట్ సెంటర్ సమీపంలో ఉన్న జాతీయ రహదారి కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇంజిన్, ట్యాంకర్ రెండు భాగాలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

రోడ్డు ప్రమాదం... రెండు ముక్కలైన ట్యాంకర్

ABOUT THE AUTHOR

...view details