ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Negligence on Sanitation Works: పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం.. డ్రైనేజీలుగా పంట కాలువలు..

By

Published : Jun 15, 2023, 10:02 AM IST

Updated : Jun 15, 2023, 2:06 PM IST

Negligence on Sanitation Works: నెల్లూరు జిల్లాలో పట్టణీకరణను విస్మరించారు. అభివృద్ధి చెందుతున్న పెద్ద పంచాయితీలు, పురపాలక సంఘాలలో పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో కాలువలు దుర్గంధకాసారాలుగా మారాయి. నిధుల కొరత, స్వచ్ఛతపై పాలకుల్లో ప్రణాళిక లేకపోవడం ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

Etv Bharat
Etv Bharat

Negligence on Sanitation Works: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీలో 50వేల జనాభా నివసిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంచాయతీలో ఒకప్పుడు సాగునీటిని అందించిన పంట కాలువలు నేడు మురుగు కాలువలుగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీ పరిధిలో కనిగిరి రిజర్వాయర్ నుంచి వచ్చే రేబాల కాలువ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. మరొకటి గుడిపల్లి కాలువ మూడు కిలోమీటర్లు ఉంటుంది. బుచ్చిరెడ్డిపాలెం చుట్టూ ఈ పంటకాలువలు విస్తరించి ఉంటాయి.

స్వచ్ఛంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచాల్సిన ఈ పంటకాలువలు మురుగు కూపాలుగా మారాయి. ఇళ్ల మధ్యనుంచి వెళ్తున్న కాలువల్లో పారుదల లేక దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్​సీపీ నాలుగేళ్లపాలనలో పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం చేయటంతో మురుగుకాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి వ్యర్థాలతో నిండిపోయాయని స్థానికులు చెబుతున్నారు.

పారిశుద్ధ్య పనులు పట్టించుకోని అధికారులు.. కార్మికుడిగా మారిన వార్డు కౌన్సిలర్

కాలనీవాసులకు తరచూ జ్వరాలు వస్తున్నాయని.. ఇళ్ల ముందే కాలువల్లో మురుగు నిలిచి ఉండటంతో దుర్వాసన వస్తోందని తెలిపారు. మేజర్ పంచాయతీ అయినా చెత్తాచెదారం తొలగించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. శాంతినగర్, అలిపురం వైపు నుంచి వచ్చే కాలువల్లో నీరు పూర్తిగా నిలిచిపోయింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, బస్టాండ్ వద్ద మురుగు నిలబడిపోయింది. రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడంతో గుత్తేదారులు కాలువలు పంచుకుని పనులు ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులను నిలిపివేశారు. ఇప్పటికైనా నగరంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి అనారోగ్యాల బారి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

విజయనగరంలో అస్తవ్యస్తంగా మురుగు కాలువలు..

"ఇది బూడిపల్లి కాలువ. దీనిలో మురుగునీరు వస్తోంది. దీనివల్ల దోమలు ఎక్కువైపోతున్నాయి. వీటి వల్ల మేము అనారోగ్యాలపాలైపోతున్నారు. మా అమ్మ కూడా దోమకాటు వల్ల మృతి చెందింది. పందులను కూడా ఈ కాలువలోనే ఉంటున్నాయి. వీటివల్ల మరింత దుర్వాసన వస్తోంది. దీనిపై మేము ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా.. ప్రయోజనం లేదు." - నూర్జహన్, స్థానికురాలు

"పొద్దుటి నుంచి పందులు ఈ కాలువలోనే ఉంటున్నాయి. చెత్త కూడా ఇక్కడే వేస్తున్నారు. మేము దీనిపై ప్రశ్నిస్తే.. ఇది గవర్నమెంట్ కాలువ.. మేము చెత్తవేస్తాం మా ఇష్టం అని అంటున్నారు. దోమలు ఎక్కువైపోతున్నాయి. దుర్వాసన కూడా ఎక్కువగా వస్తోంది. వీటివల్ల మేము అస్వస్థతకు గురవుతున్నాము. దీనిపై అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము." - రేష్మా, స్థానికురాలు

డ్రైనేజీ సమస్య... అక్కిరెడ్డిపాలెం కంపు కంపు

"నగరంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవటంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇళ్ల ముందే కాలువల్లో మురుగు నిలిచి ఉండటంతో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. ఈ కాలువలో పందులు వచ్చి చేరుతున్నాయి. వీటివల్ల మరింత దోమలు చేరిపోతున్నాయి. దోమకాటుతో మేము అనారోగ్యాలపాలవుతున్నాము.. ఇలా దోమకాటుతో ఇటీవలే ఓ వ్యక్తి మరణించారు. మరోవ్యక్తికి అయితే కాలు వాచిపోయి.. ఆస్ప్రత్రిపాలయ్యారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి.. మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము." - చాంద్ బాషా, స్థానికుడు

Last Updated : Jun 15, 2023, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details