ఆంధ్రప్రదేశ్

andhra pradesh

POLLING CLOSE: ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్

By

Published : Nov 14, 2021, 8:48 AM IST

Updated : Nov 14, 2021, 1:36 PM IST

స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా... మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.

ap-local-body-elections-polling-started-at-7-am
ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్..!

రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఎన్నిక జరగకుండా ఉండిపోయిన.. 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. పోలింగ్, లెక్కింపు సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మరో 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి:AP Local Body Elections: ఆ స్థానాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు నేడే పోలింగ్

Last Updated :Nov 14, 2021, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details