ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Chief Chandrababu Fire on CM Jagan: పోలవరంపై మాట తప్పిన జగన్ రెడ్డికి 'జూ' కట్టించాలి: చంద్రబాబు

By

Published : Aug 8, 2023, 4:35 PM IST

Updated : Aug 8, 2023, 5:13 PM IST

TDP Chief Chandrababu Fire on CM Jagan: పోలవరంపై మాట తప్పిన వైసీపీ నాయకులకు, జగన్ మోహన్ రెడ్డికి ఓ ప్రత్యేకమైన 'జూ' కట్టించి,.. ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసే మనం.. ఓ దొంగ చరిత్ర తెలిసి కూడా వచ్చే ఎన్నికల్లో ఓటేస్తామా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటై 2024లో జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.

Chandrababu
Chandrababu

TDP Chief Chandrababu Fire on CM Jagan: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే 7 రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు పర్యటన.. నేటితో 8వ రోజుకు చేరుకుంది. ఈ 8వ రోజు పర్యటనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులను సందర్శించిన చంద్రబాబు.. వాటి స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

పోలవరం నిర్వాసితులను మోసం చేసిన దుర్మార్గుడు జగన్..చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ''పోలవరం నిర్వాసితులను మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందకపోగా.. లబ్ధిదారుల జాబితాను మార్చి, అక్రమాలకు పాల్పడుతున్నారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షల పరిహారం ఇస్తామన్న హామీ ఏమైంది జగన్..?. పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం పార్టీ వారికి (నిర్వాసితులకు) పునరావాసం కల్పించింది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో ఈ జగన్ రెడ్డి కొత్తగా ఒక్క కట్టడమూ కూడా కట్టలేకపోయాడు. ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉండగా.. 50శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్‌ ద్వారా పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని మేము నిర్ణయిస్తే.. ఈ వైసీపీ సర్కార్ దానిని అటకెక్కించింది.'' అని ఆయన ధ్వజమెత్తారు.

AP CM Jagan mohan Reddy visited Polavaram displaced areas పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం: సీఎం జగన్

ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులు ఆగిపోయాయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు డెల్టా ఆధునికీకరణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు 5శాతం కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. గోదావరి ప్లడ్ బ్యాంక్స్ ఆయకట్టుకు జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.7 కోట్ల ఖర్చును కూడా పెట్టలేకపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 2022లో గోదావరి ఫ్లడ్ బ్యాంకులను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన జలవనరుల శాఖ.. ఏడాది దాటినా కూడా దానిపై దృష్టి పెట్టలేదనిచంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu Visits Polavaram: "పోలవరం దుస్థితి చూస్తే కన్నీళ్లొస్తున్నాయి"

మాట తప్పిన వైసీపీ నాయకులకు 'జూ' కట్టాలి.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తోట వెంకటాచలం, పుష్కర ఎత్తిపోతల పథకాల భద్రత పూర్తిగా విఫలమైందని.. చంద్రబాబు నాయుడు విమర్శించారు. దీంతోపాటు ముసురుమిల్లి రిజర్వాయర్ పనులు కూడా ఆగిపోయాయన్న చంద్రబాబు.. వెంకటనగరం లిఫ్ట్ ఆయకట్టు రివర్స్ టెండరింగ్ వల్ల పనుల నిలిపివేశారని మండిపడ్డారు. భూపతిపాలెం రిజర్వాయర్, చాగల్నాడు ఎత్తిపోతల పథకాలకు నిర్వహణ సక్రమంగా జరగటం లేదని గుర్తు చేశారు. పోలవరంపై మాట తప్పిన వైఎస్సార్సీపీ నాయకులకు ప్రత్యేకంగా 'జూ' కట్టి ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఒక మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో.. పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసం ఓ ఉదాహరణ. నిర్వాసితులకు ఇచ్చిన హామీలపై సమాధానాలు చెప్పలేక ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయటం జాతి ద్రోహమే. ఎన్ని తప్పులైనా చేసి, ఎదురుదాడి చేస్తే భయపడి మౌనంగా ఉంటామని అనుకుంటున్నారా..? కొంతమంది సిగ్గులేకుండా విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారు. ది గ్రేట్ మేధావులు అని చెప్పుకునేవారు.. ఇప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారో..? లేక ఇంకా పాతాళానికి నెట్టేస్తారో..? ఆలోచించుకోండి.-నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

CM Jagan Comments On Polavaram: కేంద్రానిదే బాధ్యత..! పోలవరం కట్టేదీ వాళ్లే.. పరిహారం ఇచ్చేదీ వాళ్లే: సీఎం జగన్

Last Updated :Aug 8, 2023, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details