ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుపాకి తనిఖీ చేస్తుండగా మిస్ ఫైర్.. తప్పిన ప్రమాదం

By

Published : Dec 30, 2022, 5:25 PM IST

Gun Misfired: ఈనెల 26న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శ్రీశైలం పర్యటన సమయంలో.. బందోబస్తు విధులకు వచ్చిన ఎస్సై తన తుపాకీని తనిఖీ చేసుకుంటుండగా గన్ మిస్ ఫైర్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

While checking the gun misfired
తుపాకి తనిఖీ చేస్తుండగా మిస్ ఫైర్.... తప్పిన ప్రాణనష్టం

Gun Misfired: శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో గన్ మిస్​ ఫైర్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 26న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శ్రీశైలం పర్యటనకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బందోబస్తు విధులకు వచ్చిన ఒక ఎస్సై పోలీస్ స్టేషన్లో తన తుపాకిని తనిఖీ చేసుకుంటుండగా మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఘటనపై పోలీసు ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details