ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మా భూముల్లో వైకాపా నేతల జులుం.. కాపాడండి: ఎస్సీ కుటుంబాలు

By

Published : Oct 7, 2020, 5:31 PM IST

తమ కుటుంబాలకు చెందిన భూమిని అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారంటూ... కర్నూలు జిల్లా ఆదోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం, ప్రాణహాని కలిగితే అధికార పార్టీ నేతలదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పాయి.

మా భూముల్లో వైకాపా నేతల జులుం.. కాపాడండి : ఎస్సీ కుటుంబాలు
మా భూముల్లో వైకాపా నేతల జులుం.. కాపాడండి : ఎస్సీ కుటుంబాలు

తమ భూమిని అధికార పార్టీ నేతలు కబ్జా చేశారని ఆరోపిస్తూ.. కర్నూలు జిల్లా ఆదోని తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. మండిగిరి పంచాయతీలోని 444 డి1 సర్వే నెంబర్ వద్ద 70 సెంట్ల భూమిని 18 మంది కొనుగులు చేశారు.

రేకుల షెడ్లల్లో..

సదరు భూమిలో రెండు కుటుంబాలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నాయి. కొన్ని నెలలు క్రితం రేకుల షెడ్డును అధికార పార్టీ నేతలు తొలగించారని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు చెందిన ఎర్రిస్వామి, గిడ్డు మల్లి, మరికొందరు నేతలు తమ భూమిపై కన్నేసి తమను ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకే ఈ ధర్నా..

ఫలితంగానే న్యాయం కోసం ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు. భూకబ్జాకు గురైన 18 ఎస్సీ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని తహసీల్దార్ రామకృష్ణకు వినతి పత్రం అందించారు. బాధిత కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అధికార పార్టీ నాయకులు, అనుచరులదే పూర్తి బాధ్యత అని బాధితులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలి'

ABOUT THE AUTHOR

...view details