ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sankranti Sambaralu: అక్కడ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు... ఎందుకో తెలుసా..?

By

Published : Jan 9, 2022, 2:05 PM IST

Sankranti Sambaralu

Sankranti Sambaralu: తెలుగువారికి ఎంతో ముఖ్యమైన పండగ సంక్రాంతి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగు రంగుల ముగ్గులు, నోరూరించే పిండి వంటలు... ఇలా మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకుంటారు. అలాంటి పండగ ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో... కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిపింది.

పాఠశాలలో విద్యార్థుల ముందస్తు సంక్రాంతి వేడుకలు

Sankranti Sambaralu: సంక్రాంతి వస్తోందంటే చాలు చిన్నాపెద్దా ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా.. అంటూ సంక్రాంతి పాటలు పాడుకుంటారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలతో ఆనందంగా గడుపుతారు. అలాంటి పండగ విశేషాలను చిన్నారులకు తెలిపే ఉద్దేశంతో.. కర్నూలులోని ఓ పాఠశాల యాజమాన్యం ముందస్తు సంక్రాంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు ఆనందంగా ఈ సంబరాల్లో ఆడిపాడారు.

అలరించిన విద్యార్థుల నృత్యాలు..

పాఠశాల ఆవరణలో భోగిమంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, హరిదాసులు అన్నింటినీ ఏర్పాటు చేశారు. పండగ 3 రోజులు ఎలా జరుపుకుంటారో అన్నింటిని చిన్నారులతో చేయించారు. సంక్రాంతి పాటలకు చిన్నారులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. పండగ ముందే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సంబరాల్లో ఎంతో ఆనందంగా గడిపామని విద్యార్థులు తెలిపారు.

విద్యార్థులకు పండగ ప్రాముఖ్యత తెలిపేందుకే..

విద్యార్థి దశ నుంచే పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను బోధించటం అవసరమని భావించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. అందులో భాగంగానే... పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:మీకు తెలుసా..? శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి...!

ABOUT THE AUTHOR

...view details