కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిలో ఇసుక తరలింపు ఎడ్లబండ్లపై యథేచ్ఛగా సాగుతోంది. ఒక్కో ఎడ్లబండికి రూ.వెయ్యినుంచి రూ.1500 వరకు పలుకుతుండడం, వారు ఇంటివద్దకే తెస్తుండటంతో... నగరవాసులు తమ అవసరాలకు వీరి ద్వారా ఇసుక తెప్పించుకుంటున్నారు. నదీ తీరంలో పీకల్లోతు నీళ్లల్లో దిగి ప్రమాదకర స్థితిలో ఇసుకను తోడుతున్నారు.