ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PARISHAD RESULTS: కర్నూలు పరిషత్​ ఎన్నికల ఫలితాల్లో వైకాపా జయభేరి

By

Published : Sep 19, 2021, 8:36 PM IST

Updated : Sep 19, 2021, 8:48 PM IST

కర్నూలు

కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు పూర్తైంది. జిల్లా మొత్తంలో వైకాపా ఘన విజయం సాధించింది.

కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల (PARISHAD RESULTS) లెక్కింపు పూర్తైంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

జిల్లాలో 807 ఎంపీటీసీలకు గాను 312 ఏకగ్రీవం అయ్యాయి. 11 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 484 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలకు గాను 16 ఏకగ్రీవం అయ్యాయి. నంద్యాల జడ్పీటీసీ స్థానంలో అభ్యర్థి మరణించగా.. మిగిలిన 36 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి.

484 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా 406, తెదేపా 62, భాజపా-జనసేన 3, ఇతరులు 13స్థానాల్లో విజయం సాధించారు. ఇక 36 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగ్గా అన్నింటినీ వైకాపా కైవసం చేసుకుంది.

కర్నూలు పరిషత్​ ఎన్నికల ఫలితాల్లో వైకాపా జయభేరి

36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలలో ఎవరెన్ని గెలిచారంటే..

Last Updated :Sep 19, 2021, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details