ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనాతో మహిళ కానిస్టేబుల్ మృతి

By

Published : May 15, 2021, 6:13 PM IST

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్​లో మహిళ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న జువ్వనపూడి కోమలి...కరోనాతో మృతి చెందింది. కోమలికి 8 నెలల క్రితమే వివాహం జరిగింది.

కరోనాతో మహిళ కానిస్టేబుల్ మృతి
కరోనాతో మహిళ కానిస్టేబుల్ మృతి

తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ జువ్వనపూడి కోమలి కొవిడ్​తో మృతి చెందింది. ఈ నెల 8 వ తేదీన ఆమెకు కరోనా సోకగా...13 వ తేదీన విజయవాడలోని టైమ్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది. ఘంటసాల మండలం కొడాలికి చెందిన కోమలికి 8 నెలల క్రితం మెరకనపల్లి గ్రామానికి చెందిన చందోలు బసవ సుబ్బారావుతో వివాహం జరిగింది. ఇప్పటికే తోట్ల వల్లూరు ఎస్సై కిషోర్ బాబు ఇప్పటికే కరోనాతో సన్​రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తోట్లవల్లూరు పోలీస్​స్టేషన్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details