ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..

By

Published : Apr 7, 2022, 4:28 AM IST

Indigo Plane Emergency Landing at Vijayawada: ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం.. విజయవాడ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అరగంట తరువాత హైదరాబాద్​కు​ బయలుదేరింది.

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ విమానం.. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​ చేరుకోవాల్సి ఉంది. అయితే.. ఏటీసీ సిగ్నల్ ఇవ్వకపోవడం, ఇంధన నిల్వలు తక్కువగా ఉండటంతో విజయవాడలో అత్యవసర ల్యాండింగ్​కు అనుమతిచ్చారు. 227 మంది ప్రయాణికులతో ఉన్న విమానం.. ఇంధనం నింపుకొని అరగంట తరువాత హైదరాబాద్​ బయలుదేరింది.

ABOUT THE AUTHOR

...view details