ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా నేతలకు అందుబాటులోకి రాని వల్లభనేని వంశీ

By

Published : Oct 30, 2019, 6:18 AM IST

తెదేపా నేతలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్​లో చికిత్స తీసుకుంటున్నారని వంశీ అనుచరుల ద్వారా సమాచారం అందింది. ఆరోగ్యం కుదుటపడిన అనంతరం తెదేపా నేతలతో మాట్లాడతారని భావిస్తున్నారు.

ఎమ్మెల్యే వంశీతో సంప్రదింపులపై తెదేపా నేతల ఆశాభావం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం నేతలకు అందుబాటులోకి రాలేదు. ఆయనను బుజ్జిగించి సమస్యను పరిష్కరించే బాధ్యత కేశినేని నాని, కొనకళ్ల నారాయణలకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వీరు వంశీని సంప్రదించే ప్రయత్నం చేయగా... హైదరాబాద్​లో వైద్య చికిత్సలో ఉన్నరనే.. సమాచారం అనుచరుల ద్వారా అందింది. వంశీ త్వరలోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం స్థానికంగా జోరు అందుకోగా... ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వంశీకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని... వైద్య చికిత్సల కారణాన్ని దాటవేత ధోరణిగా భావించలేమని నేతలు అంటున్నారు. త్వరలో తెదేపా నేతలతో వంశీ సంప్రదింపులు జరుపుతారని తెదేపా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Intro:Body:

ap_vja_04_30_vamsi_no_tuch_with_tdp_dry_3064466_2910digital_1572368932_678


Conclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details