ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ బస్సులో మంటలు... ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు

By

Published : Oct 21, 2022, 9:35 AM IST

Updated : Oct 21, 2022, 11:12 AM IST

Fire in RTC Bus
ఆర్టీసీ బస్సులో మంటలు

09:28 October 21

బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు

ఆర్టీసీ బస్సులో మంటలు...

కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పులవర్తిగూడెం సమీపంలో ఉన్నట్లుండి బస్సులో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు. మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రయాణికులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 21, 2022, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details