12:12 September 28
పవన్కల్యాణ్పై వైకాపా నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నా: జీవీఎల్
అధికార పార్టీ నాయకుల తీరును భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. పవన్కల్యాణ్పై వైకాపా నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. విమర్శలకు సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలని హితవు పలికారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైకాపా శ్రద్ధ పెట్టాలని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : somu veerraju: 'ఊడిపోయే పదవి కాపాడుకునేందుకు పేర్ని నాని ప్రయత్నం'