ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Three missing in Gundlakamma river: శుభకార్యానికి వచ్చి నదిలో గల్లంతై ముగ్గురు మృతి..

By

Published : Mar 1, 2022, 3:32 PM IST

Updated : Mar 1, 2022, 6:01 PM IST

Three missing in Gundlakamma river
గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

15:30 March 01

మృతదేహాలు లభ్యం...

గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Three missing in Gundlakamma river: గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు వద్ద గల గుండ్లకమ్మ నదిలో.. ఈత కోసం దిగి గల్లంతైన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. వినుకొండలో ఓ శుభకార్యానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లి.. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతైనట్లు వివరించారు. మరణించిన వారంతా ఆయేషా సిద్ధికా(19) విజయవాడ, హీనా (22)వినుకొండ, ఫీజుల్లా ఖాన్ (19) నర్సారావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఒకేసారి ముగ్గురు మృతిచెందటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి:

Land Controversy: సినీ ప్రముఖులకు దరఖాస్తు పట్టాలు.. సోషల్‌మీడియాలో విమర్శలు..!

Last Updated :Mar 1, 2022, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details