ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ - సంక్రాంతి తర్వాత నిర్ణయం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 11:13 AM IST

TDP Contest in 2024 Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. ఒక స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు తమకు అనుకూలిస్తాయా ? లేదా అనే విషయాలను కూలంకషంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

TDP_in_2024_Rajya_Sabha_Election
TDP_in_2024_Rajya_Sabha_Election

TDP Contest in 2024 Rajya Sabha Election :రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. ఒక స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు తమకు అనుకూలిస్తాయా ? లేదా అనే విషయాలను కూలంకషంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోటీకి అధిష్ఠానం సరే అంటే పోటీలో నిలిచేందుకు తాము సిద్ధమని ఇద్దరు నేతలు ముందుకు వచ్చినట్లు సమాచారం. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అవసరమైన బలం తెలుగుదేశానికి లేదు.

అధికార పార్టీపై ఉన్న ఆక్రోశం టీడీపీకి కలిసొస్తుందా? :వైఎస్సార్సీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీకి దించాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై టీడీపీ అధిష్ఠానం ఆలోచన చేస్తోంది. సంక్రాంతి తురువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారిలో వైఎస్సార్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేశ్‌, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్‌ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ స్థానాలకు మార్చిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

రాజ్యసభ ఎన్నికలు: సీఎం జగన్ మదిలో ఉన్న ఆ నలుగురెవరు?

టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు :టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది ఉన్నారు. వీరిలో విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వాసుపల్లి గణేశ్‌, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, వైఎస్సార్సీపీలో చేరారు. అధికార పార్టీ నుంచి నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో టీడీపీ సంఖ్యాబలం 23 అవుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలంటే ఈ బలం సరిపోదు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో జగన్​పై తీవ్ర అసంతృప్తి :ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుతో వైఎస్సార్సీపీలో రోజురోజుకు గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి. జగన్‌ చేతిలో తీవ్ర అవమానానికి గురైన ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీరిలో కొందరు టీడీపీ ముఖ్యనేతలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరికి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తేల్చి చెప్పడంతో వారంతా క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నారు.

పెద్దల సభలో పెరగనున్న కాంగ్రెస్‌ బలం.. 11 మంది ఎన్నికయ్యే అవకాశం!

వైఎస్సార్సీపీలో టికెట్లు దక్కని వారిలో 40 మందికిపైనే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. టికెట్లు రావనే అభద్రతాభావం మరికొందరిలో ఉంది. వీరంతా వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికే మద్దతు తెలుపుతామని సంకేతాలు ఇస్తున్నారు. అవసరమైతే వైఎస్సార్సీపీలో ఉంటూనే మద్దతు ఇస్తామని కొందరు, రెండు, మూడో ప్రాధాన్య ఓట్లలో అయినా టీడీపీ అభ్యర్థికి ఓట్లేస్తామని మరికొందరు చెబుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్సీ ఫలితాలే మూలం : గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పంచుమర్తి అనూరాధ సరిపడా సంఖ్యా బలం లేకున్నా అనూహ్యంగా విజయంసాధించారు. అలాగే ఇప్పుడూ టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో గెలిచే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం.. వెంకయ్య కీలక సూచనలు

ABOUT THE AUTHOR

...view details