ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pawan Kalyan In Delhi: దిల్లీకి చేరిన పవన్​ కల్యాణ్​.. పొత్తులపై ఏమన్నారంటే..!

By

Published : Jul 17, 2023, 10:37 PM IST

NDA Meeting In Delhi: ఎన్డీఏ కూటమి నిర్వహిస్తున్న భేటీలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ దిల్లీ చేరుకున్నారు. ఈ భేటి కోసం బీజేపీ అగ్రనేతల నుంచి ఆహ్వానం అందగా ఆయన దిల్లీకి వెళ్లారు. రేపటి సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు.

Etv Bharat
Etv Bharat

Pawan Reached To Delhi For NDA Meeting: మంగళవారం దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీ జరగబోతుంది. ఈ భేటీకి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బీజేపీ పెద్దల ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. దీంతో పవన్​కల్యాణ్​ దిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనే అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లు పవన్​ కల్యాణ్​ తెలిపారు. బీజేపీ సినీయర్​ నేతలు తనను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉందని వివరించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి మార్గాలపై భేటీలో చర్చించనున్నట్లు వివరించారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తామని ఆయన వివరించారు.

దిల్లీలో ఎన్డీఏ భేటీ..భారతీయ పార్టీ ఆధ్వర్యంలో జులై 18వ తేదీన దేశ రాజధాని దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీ జరగబోతుంది. ఈ భేటీకి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బీజేపీ పెద్దల ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. ప్రస్తుతానికి జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ ద్వారా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంపై ఏదైనా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.

NDA Meeting 2023 : ఐక్యత పేరుతో ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహిస్తున్న వేళ దిల్లీ వేదికగా తమ బలాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ) సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఎన్​డీఏ సమావేశంలో ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కొత్త భాగస్వామ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు గతంలో ఎన్​డీఏ నుంచి వైదొలిగిన వారిని సైతం తిరిగి కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఇటీవల బీజేపీఅనేక ప్రయత్నాలు చేసింది. దిల్లీలో జరగనున్న ఎన్​డీఏ సమావేశం ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని కమలదళం ప్రారంభించనుందని సమాచారం. తనతో పాటు భాగస్వామ్య పార్టీలను తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్న వేళ దిల్లీలో జరగనున్న ఎన్​డీఏ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరుకానున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

Amanchi Swamulu to Janasena: 'జనం బాగుండాలంటే.. జగన్‌ పాలన పోవాలి'

ABOUT THE AUTHOR

...view details