ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అచ్చెన్నాయుడిని గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించండి'

By

Published : Jul 8, 2020, 7:09 PM IST

Updated : Jul 8, 2020, 9:33 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రిజనర్స్ చట్టం సెక్షన్ 39 ప్రకారం.. అచ్చెన్నాయుడికి చికిత్స కోసం వెళ్లే హక్కు ఉందని హైకోర్టు పేర్కొంది.

High court Give Justice to Acchennaidu petition
అచ్చెన్నాయడు పిటిషన్​పై హైకోర్టు తీర్పు

ఈఎస్​ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెదేపా నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడిని.. గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విజయవాడ జైలు సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వక ఆదేశాన్నిచ్చిన హైకోర్టు... అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై వారానికి రెండుసార్లు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రిజనర్స్ చట్టం సెక్షన్ 39 ప్రకారం ఈ ఆదేశాలు ఇస్తున్నామన్న ధర్మాసనం.. చికిత్స కోసం వెళ్లే హక్కు ఆయనకు ఉందని తెలిపింది.

Last Updated : Jul 8, 2020, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details