ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

By

Published : Sep 10, 2021, 7:12 PM IST

గుంటూరు జిల్లా పెదకొండూరులో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామానికి చెందిన కొండూరు ఫ్రాన్సిస్.... వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. దీని కోసం రూ.ఐదు లక్షలు అప్పు చేశాడు. ఈ సమయంలో ఫ్రాన్సిస్ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ పరిణామాలతో అప్పు తీరుస్తాడో, లేదోనన్న భావనతో అప్పు ఇచ్చిన వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫ్రాన్సిస్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details