ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు స్వర్ణభారతనగర్‌లో ఇరువర్గాల ఘర్షణ

By

Published : Oct 12, 2021, 12:00 PM IST

ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంటూరు స్వర్ణభారతి నగర్​లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

గుంటూరు స్వర్ణభారతనగర్‌లో ఇరువర్గాల ఘర్షణ
గుంటూరు స్వర్ణభారతనగర్‌లో ఇరువర్గాల ఘర్షణ

ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంటూరు స్వర్ణభారతి నగర్​లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్వర్ణభారతనగర్‌కు చెందిన భారతి, సాల్మన్‌, కుమారి నగర శివారు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండటమే గాక...పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్రమించి క్రయవిక్రయాలు చేస్తున్నారు. దీన్ని స్థానికంగా ఉండే జోజి, అక్బర్, రవి, రాజులు అడ్డుకోవడంతో వారిపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా....స్వల్ప గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details