ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రయాణంలో ఆభరణాలు పోయాయి..ఎయిరిండియా అధికారులు పట్టించుకోవడం లేదు'

By

Published : Apr 25, 2021, 10:34 AM IST

ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసిన సమయంలో.. తన లగేజీలో ఉన్న బంగారు వస్తువు చోరీకి గురైనట్లు ఓ ప్రయాణికురాలు ఆరోపించారు. మూడు నెలలుగా అనేక ఫిర్యాదులు చేసినా స్పందించటం లేదని వాపోయారు.

passenger  Lakshmi Priya
ప్రయాణికురాలు లక్ష్మీ ప్రియ

ప్రయాణికురాలు లక్ష్మీ ప్రియ

ప్రయాణికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఎయిర్ ఇండియా సంస్థపై గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ ప్రియ అనే ప్రయాణికురాలు విజయవాడ నుంచి వారణాసి వెళ్లే క్రమంలో ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేశారు. ఆ సమయంలో తన లగేజీలో ఉన్న బంగారు వస్తువులు అపహరణకు గురైనట్లు ఆమె చెప్పారు. ఘటన గురించి వారణాసి, ఢిల్లీ, విజయవాడ ఎయిర్​ పోర్ట్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మూడు నెలలుగా అనేక ఫిర్యాదులు చేసినా సమస్యపై స్పందించటం లేదని ఆమె వాపోయారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఆ సంస్థ అర్థం లేని సమాధానం చెబుతున్నారని ఆమె ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details