ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏలూరులో తల్లీకూతుళ్ల హత్య.. విశాఖలో పిల్లలతో సహా తల్లి అదృశ్యం

By

Published : Feb 4, 2023, 10:40 PM IST

Murder
హత్య ()

Murders: కూలి పనులు చేసుకుని జీవించే మహిళ సొంగ యేసు మరియమ్మ (37), ఆమె కుమార్తె అఖిల (15) లను అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో జరిగింది. కాగా ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

Murders:ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులో తల్లీకూతుళ్ల హత్య ఘటన తీవ్ర సంచలన రేపింది. కూలి పనులు చేసుకుని జీవించే మహిళ సొంగ యేసు మరియమ్మ (37), ఆమె కుమార్తె అఖిల (15) లను అత్యంత దారుణంగా దుండగులు హత్య చేసి పరారయ్యారు. హత్యకు రవి అనే తల్లితో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్​దేవ్​ శర్మ, నూజివీడు డీఎస్పీ ఈ అశోక్ కుమార్ గౌడ్​ల ఆదేశానుసారం ఘటనా స్థలికి చేరుకున్న ముసునూరు ఎస్సై కుటుంబరావు, రూరల్ సీఐ ఆర్ అంకబాబు విచారణ చేపట్టారు.

తల్లి పిల్లల అదృశ్యం : విశాఖ జిల్లాకంచరపాలెం బర్మా క్యాంప్‌లో పిల్లలతో మహిళ అదృశ్యమైంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి కోరాడ సత్యవతి (28) కనిపించకుండాపోయింది. దీంతో సత్యవతి తల్లి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆమె భర్తతో గొడవపడి ఇల్లు విడిచివెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సత్యవతి, పిల్లలు హరిత (5), లాస్య (3), గౌతం (2) కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details