ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనపర్తిలో పాదయాత్రకు ఘన స్వాగతం.. రైతుల పాదాలకు క్షీరాభిషేకం

By

Published : Oct 20, 2022, 4:28 PM IST

Updated : Oct 20, 2022, 8:00 PM IST

Maha Padayatra in Anaparthi: రైతుల పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. కొన్నిచోట్ల పూల వర్షం కురిపిస్తుండగా.. ఈరోజు అనపర్తిలో రైతుల పాదాలకు క్షీరాభిషేకం చేశారు.

Maha Padayatra in Anaparthi
రైతుల పాదాలకు క్షీరాభిషేకం

Amaravati Farmers Padayatra: అమరావతి ఏకైక రాజధాని కావాలని ఆకాంక్షతో రాజధాని రైతులు చేపట్టిన అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర అనపర్తి నియోజకవర్గంలోకి చేరుకుంది. తెదేపా ఆధ్వర్యంలో అమరావతి రైతులకు అఖిలపక్ష పార్టీలు ఘనస్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సతీసమేతంగా రథానికి హారతి ఇచ్చారు. గుమ్మడికాయలుతో దిష్టి తీశారు. రైతుల పాదాలకు తెదేపా నాయకులూ క్షీరాభిషేకం చేశారు. అనంతరం రథం ఎదురుగా కొబ్బరికాయలు కొట్టి అనపర్తి నియోజకవర్గంలోని పాదయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెంట ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాజీ మంత్రి జవహర్ తెదేపా నేత వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రైతుల పాదాలకు క్షీరాభిషేకం
Last Updated :Oct 20, 2022, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details