ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా బుద్ధి రావడం లేదు'

By

Published : May 29, 2020, 7:23 PM IST

హైకోర్టు తీర్పు పట్ల తూర్పు గోదావరిజిల్లా పి గన్నవరంలో తెదేపా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైకాపా ప్రభుత్వానికి హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా బుద్ధి రావడం లేదని నాయకులు ఎద్దేవా చేశారు.
tdp leaders honoured with milk to ambedkar  in p gananvaram
పి గన్నవరంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని మూడు రహదారుల కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైకాపా ప్రభుత్వానికి హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా బుద్ధి రావడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం అన్నారు.

ABOUT THE AUTHOR

...view details