ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తూర్పుగోదావరి జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం!

By

Published : Dec 14, 2020, 5:22 PM IST

పి. గన్నవరం నియోజవర్గంలోని అయినవిల్లి మండల పరిధిలో 13 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

girl kidnaped in eastgodavari district
girl kidnaped in eastgodavari district

తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామంలో 13 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

కారులో వచ్చారు...

బాలిక తల్లిదండ్రుల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాలిక తల్లి వద్ద కాకుండా.. శానపల్లిలంకలో తండ్రి వద్ద ఉంటుందని స్థానికులంటున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక రహదారిపై నడిచి వెళ్తుండగా.. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు.

ఇదీ చదవండి

పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details