ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాలయోగికి నివాళులర్పించిన ప్రముఖులు

By

Published : Mar 3, 2021, 4:58 PM IST

లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన సమాధి వద్ద పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలయోగి చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.

బాలయోగి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు
బాలయోగి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు

లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన సమాధి వద్ద శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని సుబ్రమణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గుత్తులవారిపేటలో 10 కుటుంబాలను బహిష్కరించిన గ్రామపెద్దలు

ABOUT THE AUTHOR

...view details