తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం గైగోలుపాడులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లిన డేవిడ్(10)అనే బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇంటి వద్దే ఆడుకుంటున్నాడనుకున్న కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.