ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తూర్పుగోదావరిలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

By

Published : Feb 24, 2021, 9:01 AM IST

భీష్మ ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉడిముడిలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్ల ఆశీస్సులు పొందారు.

beeshma ekadashi celebrations in east godavari temples
తూర్పుగోదావరిలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

చిన్న అంతర్వేదిగా ప్రసిద్ధి పొందిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఉడిముడిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. మాఘ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్చకులు స్వామివారి కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున కల్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ నెల 28 వరకు స్వామివారి కల్యాణోత్సవాలు జరగనున్నట్లు ఆలయార్చకులు తెలిపారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో

భీష్మ ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామికి.. గరుడ వాహన సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details