ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Erravaram Accident: బైకును ఢీకొట్టిన బస్సు... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

By

Published : Nov 25, 2021, 4:59 AM IST

Erravaram Accident

తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని(a woman died in Erravaram Accident) బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం(accident at Erravaram in west godavari district) జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిగా... మరో ముగ్గురు గాయపడ్డారు. పెనుమంద్ర గ్రామానికి చెందిన సత్యనారయణ.. తన భార్య, ఇద్దరు పిల్లలతో ద్విచక్ర వాహనంపై విజయనగరం నుంచి స్వగ్రామం వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారిపై అవంతి కంపెనీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారయణ భార్య కల్యాణి అక్కడికక్కడే మృతి(a woman died in Erravaram Accident) చెందింది. గాయపడ్డ సత్యనారయణ, ఇద్దరు పిల్లలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలు తట్టుకోలేక.. చిన్నారుల ఏడ్పులను చూసి స్థానికులు కంటతడిపెట్టుకున్నారు.

ఇదీ చదవండి..

ఆ రోడ్డుపై వెళ్లాలంటే చాలు... వణికిపోతున్న వాహనదారులు

ABOUT THE AUTHOR

...view details