ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా నేతలతో కలిసి వాలంటీర్ల ఎన్నికల ప్రచారం

By

Published : Apr 10, 2021, 9:45 PM IST

volunteers election campaign in kampallem, tirupati bi election campaign
కాంపాళ్లెంలో వాలంటీర్ల ఎన్నికల ప్రచారం, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు ()

వైకాపా నేతలతో కలిసి వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివాదం నెలకొంది. చిత్తూరు జిల్లా బీఎన్​ కండ్రిగ మండలం కాంపాళ్లెంలో ఈ ఘటన జరిగింది. వాలంటీర్ల ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నా వారు లెక్క చేయలేదు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా చిత్తూరు జిల్లా బీఎన్​ కండ్రిగ మండలం కాంపాళ్లెంలో.. వైకాపా కార్యకర్తలతో కలిసి వాలంటీర్లు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ వాలంటీర్లు ప్రచారం చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి:వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు

నెలవారీ జీతాలను ప్రభుత్వం ఇస్తుందా లేక వైకాపానా అని వాలంటీర్లను స్థానికులు ప్రశ్నించారు. ఈ ఘటనపై గ్రామంలో వివాదం నెలకొంది. ఇదేమీ లెక్క చేయకుండా అధికార పార్టీ నేతలతో కలిసి వారు పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు.

ఇదీ చదవండి:

తిరుపతికి వస్తే హోమ్ ఐసోలేషన్​లో ఉండాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details