ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Accident: కారుని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

By

Published : Jan 29, 2022, 5:36 PM IST

Two Persons Died in a Accident at Chittoor District: చిత్తూరు జిల్లా కలికిరి మండలం సొరకాయలపేట కట్ట వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Accident at Chittoor District
చిత్తూరు జిల్లాలో కారును ఢీకొట్టిన లారీ

Accident at Chittoor District: వేగంగా వచ్చిన లారీ.. రోడ్డు దాటుతున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలికిరి మండలం సొరకాయలపేట కట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగింది. కడప జిల్లా యెనుగుండ్లపాలెేనికి చెందిన కాంట్రాక్టర్ లోకేశ్​ రాజు.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లిలో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో టి. సుండుపల్లి మండలం పొలిమేరపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రగుట్టపల్లి హరిజనవాడకు చెందిన గుండ్లూరు వెంకట లక్ష్మమ్మ, వెంకటేశ్​, మల్లెల సురేంద్రలను తన సొంత కారులో కూలీ పనులకు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో సొరకాయలపేట కట్టపై రోడ్డు క్రాస్ చేస్తుండగా అతివేగంగా వచ్చిన లారీ.. వాళ్లు ప్రయాణిస్తున్న కారును డీకొట్టింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

మృతులు వెంకట లక్ష్మమ్మ, వెంకటేశ్

ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురిలో వెంకట లక్షమమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వెంకటేశ్​, సురేంద్రను పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో వెంకటేశ్​ చనిపోయాడు. సురేంద్రకు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్ మల్లికార్జునపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లోకేష్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:

Employees Relay fasting initiations : ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...

ABOUT THE AUTHOR

...view details