ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాబోయేది తెదేపా ప్రభుత్వమే.. వారిని వదిలిపెట్టం: లోకేశ్​

By

Published : Aug 30, 2022, 8:13 PM IST

LOKESH FIRES ON YSRCP: ఏపీలో రాబోయేది తెదేపా ప్రభుత్వమేనని.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. పోలీసులు వైకాపాకు ఏజెంట్లుగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల వైకాపా నేతలు పెట్టిన కేసులతో అరెస్టయి చిత్తూరు సబ్‌ జైలులో ఉన్న తెదేపా నాయకులను ములాఖత్‌ ద్వారా పరామర్శించారు.

LOKESH FIRES ON JAGAN
LOKESH FIRES ON JAGAN

LOKESH FIRES ON JAGAN: ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే.. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను జైలుకు పంపుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపేందుకు పెట్టిన అన్న క్యాంటీన్లపై దాడులు చేయడం ఏంటని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెదేపానేనని.. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జైలులో ములాఖత్‌ ద్వారా.. తెలుగుదేశం నాయకులను ఆయన పరామర్శించారు.

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 2010 అన్న క్యాంటీన్లు మూసివేశారని.. తల్లి, సోదరికి ముద్ద పెట్టని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా పెడతారని ప్రశ్నించారు. పేదలకు భోజనం లేకుండా చేసిన వ్యక్తి జగన్‌ అని దుయ్యబట్టారు.

రాబోయేది తెదేపా ప్రభుత్వమే.. వారిని వదిలిపెట్టం

"రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెదేపానే. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులను వదిలిపెట్టం. జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 2,010 అన్న క్యాంటీన్లు మూసివేశారు. తల్లి, సోదరికి ముద్ద పెట్టని వ్యక్తి ప్రజలకు ఏవిధంగా పెడతారు. పేదలకు భోజనం లేకుండా చేసిన చేసిన వ్యక్తి జగన్‌. మంగళగిరిలో అన్న క్యాంటీన్‌ ప్రారంభిస్తే ఓర్చుకోలేక.. మంగళగిరిలో 60 మంది తెదేపా కార్యకర్తలను అరెస్టు చేశారు. చంద్రబాబు పర్యటనలో అన్న క్యాంటీన్‌ ప్రారంభిస్తే ధ్వంసం చేశారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎవరైనా ధ్వంసం చేస్తారా? చంద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతను గాలికొదిలేశారు." -నారా లోకేశ్​, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details