ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అతివేగం: బైక్​ను ఢీకొన్న కారు.... ద్విచక్రవాహనదారుడు మృతి

By

Published : Dec 13, 2020, 7:18 PM IST

తిరుపతి నుంచి వేగంగా వస్తున్న కారు... తుమ్మల గుంట వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్​ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు.

అతివేగం: బైక్​ను ఢీకొన్న కారు.... ద్విచక్రవాహనదారుడు మృతి
అతివేగం: బైక్​ను ఢీకొన్న కారు.... ద్విచక్రవాహనదారుడు మృతి

తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి వేగంగా వస్తున్న కారు తుమ్మలగుంట మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేష్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు తుమ్మలగుంటలోని ఎస్సీ కాలనీకి చెందిన జాల వెంకటేష్. ఈయన స్థానిక పంచాయతీ కార్యాలయంలో స్వీపర్​గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ ఎమ్మార్ పల్లె పోలీసు స్టేషన్​లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details