చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి నెల్లూరుకు ప్లాస్టిక్ డ్రమ్ములతో వెళ్తున్న బొలెరో వ్యాను కనుమాదారిలోని దొనకోటి గంగమ్మగుడి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకేయటంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.