ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పుంగనూరు నియోజకవర్గంలో ఎంపీ మిథున్​రెడ్డి పర్యటన

By

Published : Jun 26, 2020, 7:32 AM IST

చిత్తూరు పుంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

MP Mithun Reddy toured the Punganur constituency kadapa district
పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ మిథున్​రెడ్డి

చిత్తూరు జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. పుంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను పరిశీలించారు. పుంగనూరులోని బైపాస్ రోడ్, ఆర్టీసీ డిపో పనులను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుంగనూరు పట్టణ వాసుల చిరకాల కోరిక... బస్ డిపో ఆగస్టు 15న ప్రారంభం అవుతుందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల తయారీ కంపెనీకి భూమి కేటాయించామని పేర్కొన్నారు. ప్రజలు కంపెనీ యజమానులకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details